కోదండరామున్ని దర్శించుకున్న పీఠాధిపతి
ABN , First Publish Date - 2021-07-25T04:41:40+05:30 IST
ఏకశిలా నగిరి కోదండరాముడిని మలయాళ స్వామి పీఠాధిపతి పరిపూర్ణ నందగిరి స్వామి శనివారం దర్శించుకున్నారు.
ఒంటిమిట్ట, జూలై 24 : ఏకశిలా నగిరి కోదండరాముడిని మలయాళ స్వామి పీఠాధిపతి పరిపూర్ణ నందగిరి స్వామి శనివారం దర్శించుకున్నారు. టీటీడీ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ విశిష్టత తెలియజేసి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో టీటీడీ అర్చకులు వీరరాఘవాచార్యులు, మాజీ సర్పంచ్ శ్రీహరి పాల్గొన్నారు.