ఎస్ఐ సేవా దృక్పథం
ABN , First Publish Date - 2021-07-13T05:09:52+05:30 IST
పట్టణంలోని శ్రీనివాసలాడ్జీ సమీపంలో ప్రధాన రహదారిపై ఉన్న గుంతలను ఎస్ఐ తులసీనాగప్రసాద్, వైసీపీ నాయకుడు శ్రీనివాసులరెడ్డి కలిసి కంకరచిప్స్ తోలించి గుంతలు పూడ్చారు.
![ఎస్ఐ సేవా దృక్పథం](https://media.andhrajyothy.com/appimg/galleries/192107121137499/07122021233922n9.jpg)
కమలాపురం(రూరల్), జూలై 12: పట్టణంలోని శ్రీనివాసలాడ్జీ సమీపంలో ప్రధాన రహదారిపై ఉన్న గుంతలను ఎస్ఐ తులసీనాగప్రసాద్, వైసీపీ నాయకుడు శ్రీనివాసులరెడ్డి కలిసి కంకరచిప్స్ తోలించి గుంతలు పూడ్చారు. వర్షాకాలంలో ఆ గుంతల్లో నీరు నిలవడంతో పలువురు కిందపడి గాయాలపాలైన సంఘటనలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ ట్రాక్టర్లతో కంకర చిప్స్ తెప్పించి గుంతలను పూడ్చారు. దీంతో పట్టణ ప్రజలు, వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.