రాష్ట్రస్థాయి పోటీలకు పుల్లారెడ్డిపేట విద్యార్థిని ఎంపిక
ABN , First Publish Date - 2021-01-19T05:12:45+05:30 IST
గుంటూరు నారాగార్జున యూనివర్శిటీలో ఈనెల 19న జరిగే రాష్ట్రస్థాయిక్రీడా పోటీలకు పుల్లారెడ్డిపేటకు చెందిన జె.స్వాతి అనే విద్యార్థిని ఎంపికైనట్లు పుల్లారెడ్డిపేట జడ్పీహైస్కూలు ప్రధానోపాధ్యాయురాలు అహల్యాబాయి తెలిపారు.
దువ్వూరు, జనవరి 18: గుంటూరు నారాగార్జున యూనివర్శిటీలో ఈనెల 19న జరిగే రాష్ట్రస్థాయిక్రీడా పోటీలకు పుల్లారెడ్డిపేటకు చెందిన జె.స్వాతి అనే విద్యార్థిని ఎంపికైనట్లు పుల్లారెడ్డిపేట జడ్పీహైస్కూలు ప్రధానోపాధ్యాయురాలు అహల్యాబాయి తెలిపారు. ఈనెల 15వ తేదీ ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూలులో నిర్వహించిన జిల్లా అథ్లెటిక్స్ ఎంపికలో 14 ఏళ్ల బాలికల విభాగంలో హైజం్పలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని జె.స్వాతి జిల్లా మొదటిస్థానం కైవసం చేసుకుని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిని అభినందించారు.