పంట పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

ABN , First Publish Date - 2021-10-30T04:57:12+05:30 IST

మండలంలోని గోనుమాకులపల్లె నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతుల పంట పొలాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు శుక్రవారం పరిశీలించారు. పలువురు రైతులు పొద్దుతిరుగుడు పంట వేయగా అవి మొలకెత్తక పోవడంతో నకిలీ విత్తనాలని తెలుసుకొని రైతులు లబోదిబోమన్నారు.

పంట పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు
రైతులతో మాట్లాడుతున్న శాస్త్రవేత్తలు

వీరపునాయునిపల్లె, అక్టోబరు 29: మండలంలోని గోనుమాకులపల్లె నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతుల పంట పొలాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు శుక్రవారం పరిశీలించారు. పలువురు రైతులు పొద్దుతిరుగుడు పంట వేయగా అవి మొలకెత్తక పోవడంతో నకిలీ విత్తనాలని తెలుసుకొని రైతులు లబోదిబోమన్నారు. దీంతో శాస్త్రవేత్తలు పొలాలను పరిశీలించారు. దీనిపై సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. కాగా, నాశిరకం విత్తనాలు ఇచ్చిన డీలర్‌పై చర్యలు తీసుకొని, పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి వ్యవసాయశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-10-30T04:57:12+05:30 IST