ఏవీఆర్ఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మునగా సతీష్
ABN , First Publish Date - 2021-02-02T04:50:05+05:30 IST
ఆర్యవైశ్య రాజకీయ సంఘటన సమితి (ఏవీఆర్ఎస్ఎస్)రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కడప నివాసి మునగా సతీ్షకుమార్ నియమితులయ్యారు.

కడప(మారుతీనగర్), ఫిబ్రవరి 1: ఆర్యవైశ్య రాజకీయ సంఘటన సమితి (ఏవీఆర్ఎస్ఎస్)రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కడప నివాసి మునగా సతీ్షకుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం గుంటూరు పట్టణ సంపత్నగర్లోని అయ్యప్పదేవాలయ ప్రాంగణంలో జరిగిన సమితి ఆవిర్భావ దినోత్సం కార్యక్రమంలో తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి ఆశీస్సులతో నూతనంగా ఎంపికైన కమిటీతో ప్రమాణస్వీకారం జరిగింది. ఇందులో భాగంగా మునగా సతీ్షకుమార్ను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానంతరం క్రేన్ సంస్థ అధినేత జివియల్ కాంతారావు నూతన కమిటీని అభినందించారు.