రీసర్వే పనులు పక్కాగా చేపట్టాలి : సబ్ కలెక్టర్
ABN , First Publish Date - 2021-06-24T05:06:03+05:30 IST
మండల పరిధిలోని ఎస్.రామాపురంలో పైలెట్ ప్రాజెక్టు కింద జగనన్న భూరక్ష, శాశ్వత హక్కు పథకంలో భాగంగా చేపట్టిన రీసర్వే పనులు సిబ్బంది పక్కాగా చేపట్టాలని కడప సబ్ కలెక్టరు పృథ్వీతేజ్ తెలిపారు.
పెండ్లిమర్రి, జూన్ 23: మండల పరిధిలోని ఎస్.రామాపురంలో పైలెట్ ప్రాజెక్టు కింద జగనన్న భూరక్ష, శాశ్వత హక్కు పథకంలో భాగంగా చేపట్టిన రీసర్వే పనులు సిబ్బంది పక్కాగా చేపట్టాలని కడప సబ్ కలెక్టరు పృథ్వీతేజ్ తెలిపారు. బుధవారం ఎస్.రామాపురంలో జరుగుతున్న రీసర్వే పనులను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చట్టం తీసుకువచ్చిందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్వే చేపట్టి హద్దులు వేయాలన్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా పనులు చేపట్టి రైతుల మన్ననలు పొందాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు ఉదయభాస్కర్రాజు. సర్వేయరు గంగయ్య, సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.