కేసుల పరిష్కారంలో పురోగతి సాధించాలి : ఎస్పీ
ABN , First Publish Date - 2021-12-16T04:46:20+05:30 IST
పెండింగ్ కేసుల పరిష్కారంలో పురోగతి సాధించాలని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అధికారులకు సూచించారు. బుధవారం స్థానిక వన్టౌన్ పోలీ్సస్టేషన్ను ఎస్పీ అన్బురాజన్ తనిఖీ చేశారు.

ప్రొద్దుటూరు క్రైం, డిసెంబరు 15 : పెండింగ్ కేసుల పరిష్కారంలో పురోగతి సాధించాలని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అధికారులకు సూచించారు. బుధవారం స్థానిక వన్టౌన్ పోలీ్సస్టేషన్ను ఎస్పీ అన్బురాజన్ తనిఖీ చేశారు. తొలుత పోలీ్సస్టేషన్ పరిసరాలను పరిశీలించి, పలు సూచనలు చేశారు. అనంతరం సీఐ ఛాంబర్లో స్టేషన్కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పోలీ్సస్టేషన్కు ఏఏ తరహా కేసులు వస్తుంటాయని ఆరా తీశారు. ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయని సీఐ నాగరాజును అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని, త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పోలీ్సస్టేషన్ రిసెప్షన్ను పరిశీలించి, అక్కడి మహిళా కానిస్టేబుళ్లతో మాట్లాడారు. స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా మాట్లాడాలని సూచించారు. ఎస్పీ వెంట ప్రొద్దుటూరు ఇన్చార్జి డీఎస్పీ చెంచుబాబు ఉన్నారు.