ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ కోఆర్డినేటరుగా పెండ్లిమర్రి వాసి
ABN , First Publish Date - 2021-01-16T05:22:08+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవాసాంధ్రుల కోసం ఏర్పాటు చేసిన ఏపీ నాన్ రెసిడెంట్ (ఏపీఎన్ఆర్టీ) సొసైటీ అమెరికా కోఆర్డినేటరుగా పెండ్లిమర్రి మండలానికి చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు జగన్మోహన్రెడ్డి నియమితులయ్యారు.
పెండ్లిమర్రి, జనవరి 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవాసాంధ్రుల కోసం ఏర్పాటు చేసిన ఏపీ నాన్ రెసిడెంట్ (ఏపీఎన్ఆర్టీ) సొసైటీ అమెరికా కోఆర్డినేటరుగా పెండ్లిమర్రి మండలానికి చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు జగన్మోహన్రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా అమెరికా నుం చి ఆన్లైన్లో ఆయన మాట్లాడుతూ రైతు కుటుంబం నుంచి అమెరికా వచ్చి తనకు జన్మనిచ్చిన ఆంధ్రప్రదేశ్లో అలాగే అమెరికాలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యానన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి గుర్తించి ఈ ప్రతిష్టాత్మక పదవిలో నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.