నవోదయ ప్రవేశ పరీక్షలు వాయిదా
ABN , First Publish Date - 2021-04-17T05:06:29+05:30 IST
మండలంలోని నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి 16వ తేదీన జరగాల్సిన ప్రవేశ పరీక్షలు వాయిదా వేసినట్లు నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ వై.గీత ఒక ప్రకటనలో తెలిపారు.
రాజంపేట, ఏప్రిల్16 :మండలంలోని నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి 16వ తేదీన జరగాల్సిన ప్రవేశ పరీక్షలు వాయిదా వేసినట్లు నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ వై.గీత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 6వ తరగతి ప్రవేశానికి జరగాల్సిన పరీక్ష లు వాయిదా పడ్డాయని, త్వరలో జరగబోయే పరీక్షల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. కాగా నవోద య విద్యాలయ సమితి అధికారులు పరీక్షల తేదీని 15రోజుల ముందు నిర్ణయించడం జరుగుతుం దని ప్రిన్సిపాల్ గీత తెలియజేశారు.