19 నుంచి ‘మధ్యాహ్న భోజనం’ బంద్
ABN , First Publish Date - 2021-04-17T05:03:58+05:30 IST
దాదాపు ఆరు నెలలుగా మధ్యాహ్న భోజన పథకానికి బిల్లులు సక్రమంగా ఇవ్వనందున ఈ నెల 19 నుంచి నిలిపివేస్తున్నామని వంట ఏజన్సీల మధ్యాహ్న భోజన పథకం నాయకురాళ్లు మేరీ, లక్ష్మీపార్వతి ప్రకటనలో తెలిపారు.
చెన్నూరు, ఏప్రిల్ 16: దాదాపు ఆరు నెలలుగా మధ్యాహ్న భోజన పథకానికి బిల్లులు సక్రమంగా ఇవ్వనందున ఈ నెల 19 నుంచి నిలిపివేస్తున్నామని వంట ఏజన్సీల మధ్యాహ్న భోజన పథకం నాయకురాళ్లు మేరీ, లక్ష్మీపార్వతి ప్రకటనలో తెలిపారు. ధరలు పెరిగినా అప్పులు చేసి వంట చేసి పెడుతున్నామని, ప్రభుత్వానికి ఆ కనికరం కూడా లేదని, నెలనెలా సక్రమంగా బిల్లులు ఇస్తే తమకు సమస్య ఉండదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఖాసింబీ, కుమారి, రామలక్షుమ్మ పాల్గొన్నారు.