అరటి రైతును ఆదుకొంటాం: ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-05-15T05:04:13+05:30 IST
అరటి రైతును ఆదుకొంటామని రైల్వేకోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు.
రైల్వేకోడూరు, మే 14: అరటి రైతును ఆదుకొంటామని రైల్వేకోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం రైల్వేకోడూరు మండలంలోని ఉర్లగట్టుపోడు గ్రామంలో వీచిన పెనుగాలులకు దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు తోటలను అధికారులు పరిశీలించి సమగ్రంగా నివేదికలు ఇవ్వాలనిఆదేశించారు. వైసీపీ నేతలు ధ్వజారెడ్డి, పంజం సుకుమార్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, మాజీ సర్పంచ్ రామిరెడ్డి ఓబుల్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.