ఏసీబీకి పట్టుబడ్డ జూనియర్ లైనమెన
ABN , First Publish Date - 2021-01-26T05:40:57+05:30 IST
సింహాద్రిపురం విద్యుత సబ్స్టేషన వద్ద సోమవారం జూనియర్ లైనమెన ఖాదర్వల్లి రూ.4 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు కడప ఏసీబీ డీఎస్పీ కంజాక్షన తెలిపారు. వివరాల్లోకి వెళితే...
సింహాద్రిపురం, జనవరి 25: సింహాద్రిపురం విద్యుత సబ్స్టేషన వద్ద సోమవారం జూనియర్ లైనమెన ఖాదర్వల్లి రూ.4 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు కడప ఏసీబీ డీఎస్పీ కంజాక్షన తెలిపారు. వివరాల్లోకి వెళితే... సింహాద్రిపురానికి చెందిన రామగౌని లోకే్షగౌడ్ అనే వ్యక్తి విద్యుత కనెక్షన కోసం జూనియర్ లైనమెన ఖాదర్వల్లిని ఆశ్రయించాడు. దీంతో అతడి పొలానికి విద్యుత కనెక్షన ఇచ్చేందుకు ఖాదర్వల్లి డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడంతో చేసేదేమీలేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో కడప ఏసీబీ అధికారులు సోమవారం పథకం ప్రకారం సింహాద్రిపురం సబ్స్టేషనకు చేరుకున్నారు. ఏసీబీ అధికారులు చేరుకునే సమయానికి బాధితుడి నుంచి లంచం తీసుకుంటున్న ఖాదర్వల్లిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ దాడుల్లో ఇనస్పెక్టర్లు రామాంజనేయులు, రెడ్డప్ప, శ్రీనివాసరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.