పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని టీడీపీ నాయకులపై కేసు నమోదు
ABN , First Publish Date - 2021-03-07T05:30:00+05:30 IST
పోలీస్స్టేషన్ వద్ద ఆందోళన చేస్తూ, తమ విధులకు ఆటంకం కల్పించారంటూ టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్యాదవ్, టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డితో పాటు దాదాపు 45 మందిపై మైదుకూరు పోలీసులు కేసులు నమోదు చేశారు.
మైదుకూరు, మార్చి 7 : పోలీస్స్టేషన్ వద్ద ఆందోళన చేస్తూ, తమ విధులకు ఆటంకం కల్పించారంటూ టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్యాదవ్, టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డితో పాటు దాదాపు 45 మందిపై మైదుకూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. నామినేషన్ల విత్డ్రాలో టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ధనపాల జగన్మోహన్ అధికారుల విధులకు ఆటకం కల్పించారంటూ పోలీసులు శుక్రవారం రాత్రి ఆయన ఇంటికి చేరుకుని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ నాయకులు, జగన్ కుటుంబసభ్యులు తదితరులు పోలీస్స్టేషన్ వద్దకు చేరుకుని అక్రమంగా అరెస్టు చేశారని వెంటనే విడుదల చేయాలని ఆందోళన చేశారు. కాగా పోలీసు విధులకు ఆటకం కల్గించడంతో పాటు స్టేషన్ వద్ద బైఠాయించారంటూ వారిపై కేసు నమోదు చేసినట్లు అర్బన సీఐ మధుసూదనగౌడ్ ఆంధ్రజ్యోతికి వివరించారు.