మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన
ABN , First Publish Date - 2021-06-24T04:52:39+05:30 IST
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర సమి తి పిలుపులో భాగంగా బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట వర్కర్స్ యూనియన, ఏఐటీయూసీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన చేపట్టారు.
బద్వేలు, జూన 23: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర సమి తి పిలుపులో భాగంగా బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట వర్కర్స్ యూనియన, ఏఐటీయూసీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా నేత చంద్రమోహనరాజు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు నాగేష్, నరరసింహులు మాట్లాడుతూ
రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రెండేళ్లగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందన్నారు. సమస్య లు పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నా రు. కార్యక్రమంలో యూనియన సంఘం నాయకులు వెంకటరెడ్డి, నరసింహ, నాగేంద్ర, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.