గడ్డివాము దగ్ధం - రూ. 30 వేలు నష్టం
ABN , First Publish Date - 2021-03-25T04:29:19+05:30 IST
మండలంలోని నాగులకుంట్లలో పమ్రాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో గడ్డివామి దగ్ధమై రూ.30వేలు నష్టం వాటిల్లింది.

పోరుమామిళ్ల, మార్చి 24: మండలంలోని నాగులకుంట్లలో పమ్రాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో గడ్డివామి దగ్ధమై రూ.30వేలు నష్టం వాటిల్లింది. వెంకటేశ్వర్లు అనే రైతు కు చెందిన గడ్డివామికి బుధవారం సాయంత్రం నిప్పంటుకోవడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. విష యం తెలిసిన వెంటనే అగ్నిమాపక కేంద్రం అధికారులు మంటలను అదుపు చేశారు. అయినా రైతుకు నష్టం వాటిల్లింది.