పోరుమామిళ్ల ఎస్‌ఐగా హరిప్రసాద్‌

ABN , First Publish Date - 2021-05-29T04:54:46+05:30 IST

పోరుమామిళ్ల ఎస్‌ఐగా శుక్రవారం హరిప్రసాద్‌ బాధ్యతలు స్వీకరించారు.

పోరుమామిళ్ల ఎస్‌ఐగా హరిప్రసాద్‌
బాధ్యతలు చేపట్టిన హరిప్రసాద్‌

పోరుమామిళ్ల, మే 28: పోరుమామిళ్ల ఎస్‌ఐగా శుక్రవారం హరిప్రసాద్‌ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఎస్‌ఐగా విఽధులు నిర్వహిస్తున్న మోహన్‌ కడపకు బదిలీ అయ్యారు. ఆయన స్థానం లో చాపాడులో ఎస్‌ఐగా పనిచేసే హరిప్రసాద్‌ శుక్రవారం పోరుమామిళ్ల ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టా రు. అనంతరం ఆయన పోరుమామిళ్లలోని వరికుంట్ల బస్టాండు, మహాత్మాగాంధీ సర్కిల్‌, ఆర్టీసీ బస్టాండు, అంబేడ్కర్‌ సర్కిల్‌ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కర్ఫ్యూ నిబంధనలు పాటించాలని, కరోనా నియంత్రణకు సహకరించాలని కోరారు. నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు.

Updated Date - 2021-05-29T04:54:46+05:30 IST