సచివాలయ వ్యవసతో ప్రజల వద్దకు పాలన

ABN , First Publish Date - 2021-12-31T05:04:15+05:30 IST

సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి దక్కిందని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాలు పేర్కొన్నారు.

సచివాలయ వ్యవసతో ప్రజల వద్దకు పాలన
సచివాలయ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

గోపవరం, డిసెంబరు 30 : సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి దక్కిందని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాలు పేర్కొన్నారు. గురువారం మండలంలోని కాలువపల్లె పంచాయతీ సచివాలయ నూతన భవనాన్ని వారు ప్రారంభించారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రతి పనికి మండల కార్యాలయాలకు పరిగెత్తాల్సిన పని లేదని ఏ పంచాయతీ పనులు ఆ పంచాతీలోనే చేసుకునే విధంగా సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగిందన్నారు.  కార్యక్రమంలో మార్కెట్‌యార్డ్‌ వైస్‌చైర్మన్‌ రమణారెడ్డి, మండల ప్రత్యేకాధికారి గణేష్‌, జడ్పీటీసీ జయరామ్‌రెడ్డి, ఎంపీపీ ధనలక్ష్మి, ఎంపీటీసీ రాజేశ్వరి, సర్పంచ్‌ పసుపులేటి శ్రీనివాసులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-12-31T05:04:15+05:30 IST