లోక కళ్యాణం కోసం గోపూజ మహోత్సవం
ABN , First Publish Date - 2021-01-16T05:03:00+05:30 IST
లోకకళ్యాణం కోసం పాడిపంటలతో వర్దిల్లేందుకు గోపూజ ఘనంగా నిర్వహించారు.
చక్రాయపేట, జనవరి 15: లోకకళ్యాణం కోసం పాడిపంటలతో వర్దిల్లేందుకు గోపూజ ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం కను మ పండుగ సందర్భంగా గండి దేవస్థాన సహాయ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు కేసరి, రాజా రమేష్, గోపాలస్వామి రామ్మోహనశర్మ, రఘు స్వామి గోపూజ మహోత్సవం నిర్వహించారు. గోవులను పూజించి వస్త్రాలు కప్పి ప్రత్యేక పూజలు చేశారు. మాజీ జడ్పీటీసీ ప్రవీణ్కు మార్రెడ్డి, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
వేంపల్లె, జనవరి 15: సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని వృషభాచలేశ్వర ఆలయ అను బంధ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గోపూజ నిర్వహించారు. ఆలయ చైర్మన జయచంద్రారెడ్డి, ఈఓ ఎస్ఏ ప్రతాప్, పాలక మండలి సభ్యులు, హిందూ ధర్మ ప్రచార పరిషత ఆధ్వర్యంలో గోవుకు ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.