ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు
ABN , First Publish Date - 2021-11-27T04:34:16+05:30 IST
స్థానిక క్రిస్టియన్ క్వార్టర్స్లోని సీఎస్ఐ చర్చిలో ముందస్తు క్రిస్మస్ ఆరాధనోత్సవాలు నిర్వహించారు.

దువ్వూరు, నవంబరు 26: స్థానిక క్రిస్టియన్ క్వార్టర్స్లోని సీఎస్ఐ చర్చిలో ముందస్తు క్రిస్మస్ ఆరాధనోత్సవాలు నిర్వహించారు. క్రైస్తవులు క్రిస్మస్ పండుగకు ముందుగా నిర్వహించే సపోస్ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఫాదర్ సుందరం ఆధ్వర్యంలో ఆరాధన, క్యాండిల్ లైటింగ్ సర్వీసెస్ నిర్వహించే యేసు ముఖ్య ఉద్దేశాన్ని భక్తులుకు ఉపదేశించారు. అనంతరం శుభాకాంక్షలు తెలియజేశారు.