మానవత ఆధ్వర్యంలో ఉచితంగా కృత్రిమ అవయవాల అమరిక
ABN , First Publish Date - 2021-10-30T04:58:41+05:30 IST
మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాల అమరిక కార్యక్రమాన్ని ప్రొద్దుటూరుకు చెందిన ఐశ్వర్య జ్యువెలర్స్ అధినేత సన్నుతి శ్రీనివాస్ కుటుంబం ఆర్థిక సాయంతో ఏర్పాటు చేస్తున్నట్లు మానవత సంస్థ ఎర్రగుంట్ల చైర్మన్ రఘురామిరెడ్డి తెలిపారు.
ఎర్రగుంట్ల, అక్టోబరు 29: మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాల అమరిక కార్యక్రమాన్ని ప్రొద్దుటూరుకు చెందిన ఐశ్వర్య జ్యువెలర్స్ అధినేత సన్నుతి శ్రీనివాస్ కుటుంబం ఆర్థిక సాయంతో ఏర్పాటు చేస్తున్నట్లు మానవత సంస్థ ఎర్రగుంట్ల చైర్మన్ రఘురామిరెడ్డి తెలిపారు. జిల్లాలో ఉన్న దివ్యాంగులు ఈనెల 31వ తేదీలోపు అధార్నెంబర్తో సహా పేర్లు రిజిస్టర్ చేయించుకోవాలన్నారు. నవంబరు 8వ తేదీన ప్రొద్దుటూరు పాత బస్టాండు సమీపంలోని పీఎన్ఆర్ ఫంక్షన్ హాలులో జరిగే ఈ కార్యక్రమానికి దివ్యాంగులు నేరు గా హాజరు కావాల్సి ఉంటుందన్నారు. అక్కడ వైద్య నిపుణులు పరీక్షలు చేసి వారికి సరిపడే సైజ్లలో కొలతలు తీసుకుని తద్వారా (కాళ్లు, చేతులు)కృత్రిమ అవయవాలు తెప్పిస్తారన్నారు. డిసెంబరులో మరోసారి కొలతలు తీసుకుని వైద్యుల సహాయంతో కృత్రిమ అవయవాలు అమరుస్తారన్నారు. దివ్యాంగులు వారి పేర్లను 9849265855, 9966166359, 9440903470కు ఫోన్ చేసి తెలియ జేయాలని ఆయన కోరారు.