పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించండి

ABN , First Publish Date - 2021-10-30T04:56:23+05:30 IST

పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రతిఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని స్టెప్‌ సీఈవో రామచంద్రారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆజాదీకా అమృత్‌ మహాత్సవంలో భాగంగా రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ విజయవాడ వారి ఆదేశాల మేరకు స్టెప్‌ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక డీఎస్‌ఏ మైదాన పరిసరాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించారు.

పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించండి

కడప(మారుతీనగర్‌), అక్టోబరు 29: పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రతిఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని స్టెప్‌ సీఈవో రామచంద్రారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆజాదీకా అమృత్‌ మహాత్సవంలో భాగంగా రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ విజయవాడ వారి ఆదేశాల మేరకు స్టెప్‌ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక డీఎస్‌ఏ మైదాన పరిసరాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించారు. ఆయన మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలు ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండి ఉంటే పర్యావరణం పాడవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్ర యూత్‌ ఆఫీసర్‌ మణికంఠ, డీఎస్‌ఏ చీఫ్‌కోచ్‌ బాషామోహిద్దీన్‌, శాప్‌ బోర్డు, యూత్‌ క్లబ్‌ సభ్యులు, క్రీడా కోచ్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T04:56:23+05:30 IST