ఫెన్సింగ్ రాళ్ల ట్రాక్టర్ బోల్తా : ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2021-07-27T04:46:58+05:30 IST
ఫెన్సింగ్ రాళ్ల లోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో రాళ్ల కిందపడి కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
పామూరు, జూలై 26: ఫెన్సింగ్ రాళ్ల లోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో రాళ్ల కిందపడి కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన మండలంలోని నేరేళ్లవాగు సమీపంలో సోమవారం జరిగింది. ఎస్సై సురేష్ తెలిపిన వివరాల మేరకు... కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి ట్రాక్టర్ ఫెన్సింగ్ రాళ్ల లోడుతో పామూరుకు బయలుదేరింది. గ్రామ సమీపంలోనినేరెళ్లవాగులో అదుపు తప్పి ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడింది. ప్రొద్దుటూరు మండలం కాకిరేణిపల్లికు చెందిన ఉండేల చంద్రఓబుల్రెడ్డి (38), సుంకేశుల పెద్దహుస్సేన్ (45) అనే వ్యక్తులు రాళ్లపై కూర్చొని ఉన్నారు. ప్రమాదంలో రాళ్ల కింద పడి మృతి చెందారు. ట్రాక్టర్ను తోలుతున్న డ్రైవర్ గుత్తి మస్తాన్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్సై సురేష్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ సహాయంతో రాళ్లను తొలగించి మృతదేహాలను వెలికితీశారు.