ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-02-02T05:10:37+05:30 IST

రాజంపేటలోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థి పరీక్షలు తప్పా నన్న మనస్తాపంతో ఉరేసుకు న్నాడు.

ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య
లక్ష్మీకామేశ్వర్‌రెడ్డి మృతదేహం

రాజంపేట టౌన్‌, ఫిబ్రవరి 1: రాజంపేటలోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థి పరీక్షలు తప్పా నన్న మనస్తాపంతో ఉరేసుకు న్నాడు. మన్నూరు ఎస్‌ఐ రోషన్‌ తెలిపిన వివరాల మేరకు..  పెండ్లి మర్రి మండలం మమ్ముసిద్దిపల్లెకు చెందిన లక్ష్మీకామేశ్వర్‌రెడ్డి (21) రాజంపేటలో ఇంజనీరింగ్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఇత ను  మరో ముగ్గురు విద్యార్థు లతో కలసి కళాశాల సమీపంలోని బోయనపల్లెలో ఓ గదిలో ఉండేవాడు. ఇటీవల మూడవ సంవత్సరం పరీక్షల ఫలితాలు వచ్చాయి. వాటిలో కొన్ని తప్పడంతో లక్ష్మీకామేశ్వర్‌రెడ్డి మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ఉదయం విద్యార్థులం దరూ కాలేజీకి వెళ్లిన తరువాత గది వద్ద ఉన్న ఓ స్తంభానికి ఉరివేసుకుని మృతి చెందాడు. అతని తల్లి అమ్మన్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇతని తండ్రి ఐదేళ్ల కిందట అనారోగ్యంతో మృతిచెందాడు.


విద్యార్థి మృతిపై విచారణ చేయాలి

విద్యార్థి మృతిపై విచారణ చేయాలని టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ పార్లమెంట్‌ అధ్యక్షుడు వేణుగోపాల్‌, జిల్లా ప్రచార కార్యదర్శి పోలి శివకుమార్‌ డిమాండ్‌ చేశారు. కామేశ్వర్‌రెడ్డి మృతదేహాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామేశ్వర్‌రెడ్డి మృతిపై అనుమానాలు ఉన్నాయని, సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు.  


Updated Date - 2021-02-02T05:10:37+05:30 IST