ఉపాధి హామీ కూలీ మృతి
ABN , First Publish Date - 2021-05-18T05:12:58+05:30 IST
చీమలపెంట పంచాయతీ జీసీపల్లెకు చెందిన చంద్రశేఖర్రెడ్డి (56) ఉపాధి పనులు చేస్తూ సోమవారం మృతి చెందాడు.
పెండ్లిమర్రి, మే 17: చీమలపెంట పంచాయతీ జీసీపల్లెకు చెందిన చంద్రశేఖర్రెడ్డి (56) ఉపాధి పనులు చేస్తూ సోమవారం మృతి చెందాడు. ఏపీవో రామాంజనేయరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గ్రామ సమీపంలోని గుట్టలో కండిత కందకాల పనిచేస్తూ సొమ్మసిల్లి కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారన్నారు. సంఘటనా స్థలంలో మృతదేహాన్ని ఏపీవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి పథకం ద్వారా రూ.50 వేలు నగదు కుటుంబ సభ్యులకు అందిస్తామని తెలిపారు. ఈయన వెంట ఉపాధి సీసీ సునీల్, పీవో బాలసుబ్రమణ్యంలు ఉన్నారు.