మత్తుపదార్థాల జోలికి వెళ్లవద్దు
ABN , First Publish Date - 2021-10-26T04:55:07+05:30 IST
యువత మత్తుపదార్థాల జోలికి వెళ్లవద్దని పులివెందుల జేఎన్టీయూ వైస్ ప్రిన్సిపల్ జీవీ సుబ్బారెడ్డి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ ఎస్ రామాంజనేయులు, సీఎ్సఈ విభాగాధిపతి సరితలు తెలిపారు.

పులివెందుల రూరల్, అక్టోబరు 25: యువత మత్తుపదార్థాల జోలికి వెళ్లవద్దని పులివెందుల జేఎన్టీయూ వైస్ ప్రిన్సిపల్ జీవీ సుబ్బారెడ్డి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ ఎస్ రామాంజనేయులు, సీఎ్సఈ విభాగాధిపతి సరితలు తెలిపారు. సోమవారం స్థానిక జేఎన్టీయూ కళాశాలలో మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగం - అనర్థాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తుపదార్థాల వలన యువత భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు. సరదాగా మొదలయ్యే ఈ అలవాటుతో చివరికి బానిస అవుతారన్నారు. డ్రగ్స్ కోసం నేరాలు చేసేందుకు కూడా వెనుకాడరన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.