ఓటీఎ్సకు డబ్బులు చెల్లించవద్దు
ABN , First Publish Date - 2021-12-20T04:56:08+05:30 IST
ఓటీఎ్సకు డబ్బులు ఎవరూ చెల్లించవద్దని, టీడీపీ అధికారంలోకి వస్తే ఉచితంగా రిజిస్ర్టేషన్ చేయిస్తామని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వన్టైమ్ సెటిల్మెంట్ పేరుతో రూ.10, రూ.20 వేలు చెల్లిస్తే ఇళ్లను రిజిస్ర్టేషన్ చేయిస్తామని ప్రభుత్వం పేదలపై ఒత్తిడి చేస్తోందని, ఇది తగదన్నారు.
![ఓటీఎ్సకు డబ్బులు చెల్లించవద్దు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి
కడప, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఓటీఎ్సకు డబ్బులు ఎవరూ చెల్లించవద్దని, టీడీపీ అధికారంలోకి వస్తే ఉచితంగా రిజిస్ర్టేషన్ చేయిస్తామని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వన్టైమ్ సెటిల్మెంట్ పేరుతో రూ.10, రూ.20 వేలు చెల్లిస్తే ఇళ్లను రిజిస్ర్టేషన్ చేయిస్తామని ప్రభుత్వం పేదలపై ఒత్తిడి చేస్తోందని, ఇది తగదన్నారు. పేదలేమైనా ప్రభుత్వానికి బాకీ ఉన్నారా.. ఎందుకు డబ్బులు చెల్లించాలని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్, శివారెడ్డి, జిలానీ పాల్గొన్నారు.