దివ్యాంగులకు రూ.6వేలు పెన్షన్ ఇవ్వాలి
ABN , First Publish Date - 2021-12-16T04:48:37+05:30 IST
కరోనా కష్టకాలంలో కుటుంబ పోషణ భారమై దుర్భరజీవనం సాగిస్తున్నామని, రూ.6వేలు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని దివ్యాంగులు సీఎం జగన్మోహన్రెడ్డిని వేడుకున్నారు.

సీఎం జగన్కు దివ్యాంగుల వినతి
ప్రొద్దుటూరు క్రైం, డిసెంబరు 15 : కరోనా కష్టకాలంలో కుటుంబ పోషణ భారమై దుర్భరజీవనం సాగిస్తున్నామని, రూ.6వేలు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని దివ్యాంగులు సీఎం జగన్మోహన్రెడ్డిని వేడుకున్నారు. ఈ మేరకు బుధవారం ఆల్ఫర్యు దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్, రాష్ట్ర దివ్యాంగుల సంఘం నాయకులు ఆఫ్జల్, చలపతిరావుల ద్వారా దివ్యాంగుల సమస్యలపై సీఎంకు లేఖ పంపా రు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది దివ్యాంగులు ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ క్రమంలో సామాజిక పెన్షన్ పెంచిన విధంగానే దివ్యాంగులకు కనీసం రూ.6వేలు పెన్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా సదరం సర్టిఫికెట్ కలిగిన దివ్యాంగులకు ప్రత్యేకంగా అంత్యోదయ కార్డులు మంజూరు చేసి, 35 కేజీల బియ్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యూసూఫ్, సభ్యులు మహే్షకుమార్, అంజి, నాగరాజు, ఖాజామోహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.