వృద్ధాశ్రమానికి నిత్యావసర వస్తువుల వితరణ

ABN , First Publish Date - 2021-06-21T05:13:01+05:30 IST

విజయేశ్వరి వృద్ధాశ్రమానికి తారానాథ్‌ 17వ వర్ధంతిని పురష్కరించుకుని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం డియా ఉద్యోగులు నిత్యావసర వస్తువులు వితరణ చేశారు.

వృద్ధాశ్రమానికి నిత్యావసర వస్తువుల వితరణ
వృద్ధాశ్రమానికి నిత్యావసర వస్తువులు అందజేస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు టౌన్‌, జూన్‌ 20: విజయేశ్వరి వృద్ధాశ్రమానికి తారానాథ్‌ 17వ వర్ధంతిని పురష్కరించుకుని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం డియా ఉద్యోగులు నిత్యావసర వస్తువులు వితరణ చేశారు. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్టాఫ్‌ యూనియన్‌ అమరావతి సర్కిల్‌, కడప అర్బన్‌ రీజియన్‌ సం ఘం నాయకులు ఆధ్వర్యంలో ఆదివారం రూ.20 వేలు విలువచేసే 13 బస్తాల బియ్యం, 20 కిలోల నూనె, 25 కిలోల కందిపప్పును అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ కరోనా సమయంలో వృద్ధుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కామ్రేడ్‌ తారానాఽథ్‌ వర్ధంతి సందర్భంగా వృద్ధాశ్రమానికి నిత్యావసర వస్తువులు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో తిరుపతి మాడ్యుల్‌ ఉపాధ్యక్షుడు జీఎ్‌సఆర్‌కే ప్రసాద్‌, సంఘ నాయకులు గంగాధర్‌యాదవ్‌, రాజేష్‌, చంద్రశేఖర్‌, విజయకుమార్‌ తదితరులున్నారు.

Updated Date - 2021-06-21T05:13:01+05:30 IST