విద్యాకానుక కిట్లు పంపిణీ
ABN , First Publish Date - 2021-08-22T04:33:16+05:30 IST
స్థానిక కోనేటికాల్వవీధి ఆచారిసందులోని మున్సిపల్ ఉర్దూ ప్రైమరీ స్కూల్లో శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ము న్సిపల్ వైస్ చైర్మన్ సి.ఎ్స.ఖాజామోహిద్దీన్ విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అం దజేశారు.
![విద్యాకానుక కిట్లు పంపిణీ](https://media.andhrajyothy.com/appimg/galleries/192108211056274/08212021230245n83.jpg)
ప్రొద్దుటూరు క్రైం, ఆగస్టు 21 : స్థానిక కోనేటికాల్వవీధి ఆచారిసందులోని మున్సిపల్ ఉర్దూ ప్రైమరీ స్కూల్లో శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ము న్సిపల్ వైస్ చైర్మన్ సి.ఎ్స.ఖాజామోహిద్దీన్ విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అం దజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యను అభ్యసించడంలో విద్యార్థులకు పేదరికం అడ్డుకాకూడదనే ఉద్దేశ్యంతో సీఎం జగన్మోహన్రెడ్డి విద్యావ్యవస్థల్లో అనేక మా ర్పులకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, విద్యార్థులకు తల్లిదండ్రులకు భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అబ్దుల్ రసూల్, షామీర్, రామాంజి, ఉస్మాన్, మైను, టిప్పు, ముస్తాక్, షాహీద్, ఫారూఖ్, ఆసిఫ్, అల్తాఫ్ ప్రొద్దుటూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంకి వైస్ ప్రెసిడెంట్ అక్రం గౌస్ కాంట్రాక్టర్ నిజాముద్దీన్, తదితరులు పాల్గొన్నారు.