ఇంటికి మూడు చెత్తబుట్టలు పంపిణీ
ABN , First Publish Date - 2021-06-22T04:11:30+05:30 IST
పట్టణ ప్రజలకు ప్రతి ఇంటికీ మూడు చెత్తబుట్టలు పంపిణీ చేయనున్న ట్లు మున్సిపల్ చైర్మెన వి.రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు.
![ఇంటికి మూడు చెత్తబుట్టలు పంపిణీ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
బద్వేలు , జూన 21: పట్టణ ప్రజలకు ప్రతి ఇంటికీ మూడు చెత్తబుట్టలు పంపిణీ చేయనున్న ట్లు మున్సిపల్ చైర్మెన వి.రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక నాగభూషణం డిగ్రీ కళాశాలలోని సమావేశ హాలులో స్లమ్ ఏరియా సమాఖ్య రిసోర్స్ పర్సనలు కమ్యూనిటీ ఆర్గనైజర్లతో ‘క్లీన ఆంధ్రప్రదేశ’పై ఆయన అధ్యక్షతన అవగాహన సదస్సులో చైర్మన మాట్లాడుతూ పట్టణంలో రెండు చెత్త నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేశారని, ప్రతి ఇంటినుంచి వచ్చే చెత్తను నిల్వచేసేలా ప్రతి కుటుంబానికీ అవగాహన కల్పించాలన్నారు.