అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలి
ABN , First Publish Date - 2021-06-18T04:49:50+05:30 IST
పులివెం దుల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతు న్న అభివృద్ధి పను ల్లో మరింత వేగం పెంచాలని కడప ఎంపీ వైఎస్ అవి నాష్రెడ్డి సూచిం చారు.
పులివెందుల టౌన, జూన 17: పులివెం దుల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతు న్న అభివృద్ధి పను ల్లో మరింత వేగం పెంచాలని కడప ఎంపీ వైఎస్ అవి నాష్రెడ్డి సూచిం చారు. గురువారం క్యాంప్ కార్యాలయం వద్ద మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, వైస్చైర్మన వైఎస్ మనోహర్రెడ్డి ఎంపీని కలిశారు. ఈ సందర్భంగా పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వారు ఎంపీ కి వివరించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అభివృద్ధి పనులను పూర్తిచేయాలని ఎంపీ వారికి సూచించారు. ఎప్పటికప్పుడు తమకు సమాచారాన్ని తెలియజేయాలని ఎంపీ వారితో అన్నారు.