భగ్గుమన్న ఎర్రగాలకొండ ఆక్రమణ వివాదం

ABN , First Publish Date - 2021-07-24T05:25:24+05:30 IST

సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన

భగ్గుమన్న ఎర్రగాలకొండ ఆక్రమణ వివాదం
సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న పెద్దకారంపల్లె గ్రామస్తులు

సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన 

రాజంపేట, జూలై23 : రాజంపేట మండలం పెద్దకారంపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రగాలకొండలో ఆక్రమణ వివాదం భగ్గు మంది. కొందరు అక్రమంగా చదును చేసి ఆ క్రమించుకుంటున్నారని పేర్కొంటూ పలువు రు రాజంపేట సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదు ట నిరసన వ్యక్తం చేసి వినతిపత్రం సమర్పించారు. ఎర్రగాలకొండ ప్రాంతంలో గుండాపల్లె, కారంపల్లె, కారంపల్లె అరుంధతివాడ, సుబ్బరాజుపల్లె, బ్రాహ్మణపల్లె చుట్టుపక్కల గ్రామాల్లోని పశువుల మేతకు ఈ కొండ ఉపయోగపడుతోందని, అటువంటి కొండను కొందరు ఆక్రమించి చదును చేస్తున్నారని, చర్య లు తీసుకోవాలని అక్కడి ప్రజలు ఫిర్యాదు చేశారు. ఈ కొండను ఆనుకొని ఉన్న గ్రామాల్లో 5వేల పై బడి ఆవులు, మేకలు, గొర్రెలు ఇతర పశువు లు ఉన్నాయని, అవి మేయడాని కి ఈ కొండ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వెంటనే చదును చేసిన కొండను తిరిగి స్వా ధీనం చేసుకొని ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. ఈ విషయమై రాజంపేట తహసీల్దారు రవిశంకర్‌రెడ్డిని వివరణ కోరగా ఓ మాజీ సైనిక ఉద్యోగి తనకు స్థలం కావాలని వినతిపత్రం సమర్పించారని, అతని విజ్ఞప్తి మేరకు ఆ కొండను చదును చేసుకోవడానికి తాము అనుమతి ఇచ్చామన్నారు. అయితే ప్రజలు ఈ స్థలం మూగజీవాల కోసం కావాలని కోరడంతో ఉన్నతాధికారులకు తెలియజేసిన అనం తరమే చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2021-07-24T05:25:24+05:30 IST