18 నెలల్లో నూతన వంతెన నిర్మాణం
ABN , First Publish Date - 2021-11-22T05:10:28+05:30 IST
పాపాఘ్ని నదిపై 18 నెలల్లో కొత్త వంతెనను నిర్మించేందుకు అన్ని రకాల ప్రతిపాదనలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి తెలిపారు. భారీ వర్షాలకు నీరు పోటెత్తడంతో శనివారం రాత్రి వంతెన కూలింది. దీంతో ఎమ్మెల్యే ఆదివారం పరిశీలించారు.

ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి
కమలాపురం(రూరల్), నవంబరు 21: పాపాఘ్ని నదిపై 18 నెలల్లో కొత్త వంతెనను నిర్మించేందుకు అన్ని రకాల ప్రతిపాదనలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి తెలిపారు. భారీ వర్షాలకు నీరు పోటెత్తడంతో శనివారం రాత్రి వంతెన కూలింది. దీంతో ఎమ్మెల్యే ఆదివారం పరిశీలించారు. అనంతరం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నూతన వంతెన నిర్మాణ విషయమై జాతీయ రహదారులకు సంబంధించిన సీఈల దృష్టికి సీఎం జగన్ తీసుకెళ్లారని, వారు నిర్మించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. నాయకులు ఉత్తమారెడ్డి, ప్రసాద్రెడ్డి, సుబ్బారెడ్డి, రాజశేఖర్రెడ్డి, పాల్గొన్నారు.