ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-05-11T05:03:58+05:30 IST
సమస్యల పరిష్కారానికి గ్రామ, వార్డు, సచివాలయాలకు వచ్చే ప్రజలకు సకాలంలో స్పందించి, పరిష్కరించాలని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
‘స్పందన’ కార్యక్రమంలో ఎస్పీ
కడప(క్రైం), మే 10: సమస్యల పరిష్కారానికి గ్రామ, వార్డు, సచివాలయాలకు వచ్చే ప్రజలకు సకాలంలో స్పందించి, పరిష్కరించాలని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ముఖాముఖి ‘స్పందన’ కార్యక్రమం నిర్వహించి ఫిర్యాదుదారులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా వ్యయ ప్రయాలసల కోర్చి జిల్లా కేంద్రానికి రాలేని వారు దగ్గర్లోని సచివాలయంలో ఫిర్యాదు చేస్తే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమస్య తెలుసుకుని పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.