వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదు
ABN , First Publish Date - 2021-10-21T04:55:33+05:30 IST
కడప నగరానికి చెందిన మచ్చా మురళిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ నాగభూషణం తెలిపారు. సీఐ వివరాల మేరకు... కడపకు చెందిన మురళి తండ్రికి ముగ్గురు సంతానం. కాగా, మురళి.. మిగతా ఇరువురు సోదరుల పేర్లు కనబర్చకుండా తానొక్కడినే కుమారుడనని రెవె న్యూను తప్పుదారి పట్టించి ఫ్యామిలీ సర్టిఫికెట్, ఎంజాయ్ మెంట్ సర్టిఫికెట్లను తయారు చేయించాడు.

కడప(క్రైం), అక్టోబరు 20: కడప నగరానికి చెందిన మచ్చా మురళిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ నాగభూషణం తెలిపారు. సీఐ వివరాల మేరకు... కడపకు చెందిన మురళి తండ్రికి ముగ్గురు సంతానం. కాగా, మురళి.. మిగతా ఇరువురు సోదరుల పేర్లు కనబర్చకుండా తానొక్కడినే కుమారుడనని రెవె న్యూను తప్పుదారి పట్టించి ఫ్యామిలీ సర్టిఫికెట్, ఎంజాయ్ మెంట్ సర్టిఫికెట్లను తయారు చేయించాడు. అనంతరం తన తండ్రి ఆస్తి అయిన పొలాన్ని ఇతరులకు విక్రయించి నట్లు తెలిపారు. ఈ విషయం కడప తహసీల్దార్ శివ రామిరెడ్డి దృష్టికి రాగా, ఆయన ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు.