సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2021-11-28T04:52:34+05:30 IST
ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని చిన్నచౌక్ ఎస్ఐ రోషన్ అన్నారు.
చిన్నచౌక్ ఎస్ఐ రోషన్
కడప(క్రైం), నవంబరు 27 : ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని చిన్నచౌక్ ఎస్ఐ రోషన్ అన్నారు. శనివారం ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు చిన్నచౌక్ పోలీ్సస్టేషన్ పరిఽధిలోని ప్రకా్షనగర్ ఏటీఎం సెంటర్ సమీపంలో చిన్నచౌక్ ఎస్ఐ ఎస్కె.రోషన్ స్థానికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు సైబర్ నేరాల బారినపడకుండా అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసుశాఖకు అం దించాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.