క్రికెట్‌ బెట్టింగ్‌రాయుళ్ల అరెస్టు

ABN , First Publish Date - 2021-04-24T04:53:06+05:30 IST

ఆరుగురు క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్లను అరెస్టు చేసి, వారి నుంచి రూ.50వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ విజయకుమార్‌ తెలి పారు.

క్రికెట్‌ బెట్టింగ్‌రాయుళ్ల అరెస్టు
వివరాలు తెలియజేస్తున్న డీఎస్పీ

రూ.50 వేల నగదు స్వాధీనం

మైదుకూరు, ఏప్రిల్‌ 23: ఆరుగురు క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్లను అరెస్టు చేసి, వారి నుంచి రూ.50వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ విజయకుమార్‌ తెలి పారు. డీఎస్పీ వివ రాల మేరకు.. తమకు అందిన సమాచారం మేరకు గురువారం సాయంత్రం రూరల్‌ సీఐ కొండారెడ్డి, బి.మఠం ఎస్‌ఐ శ్రీని వాసులు తమ సిబ్బందితో వెళ్లి అమగంపల్లె క్రాస్‌ రోడ్డు వద్ద నిఘా పెట్టారు. చప్పాటి శేఖర్‌, గోవిం దు బాబురావు, వీరమాను కిషోర్‌, అక్కినేని చంద్ర, జాలా మహేష్‌, బొల్లం రమేష్‌ క్రికెట్‌ పందెంలో డబ్బు లావాదేవీల విషయమై మా ట్లాడు తూ కనపడ్డారు. దీంతో వారిని విచారించి వారి వద్ద ఉన్న రూ.50 వేలు నగదు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వివరించారు.

చాపాడులో... 

మండలంలోని అన్నవరం, నాగులపల్లె గ్రామాలకు చెందిన 18 మంది వ్యక్తులను శుక్రవారం రెండు కేసులకు సంబంధించి అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ హరిప్రసాద్‌ పేర్కొన్నారు. అన్నవరం గ్రామంలో క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడుతున్న తొమ్మిది మందిని అరె స్టు చేసి వారి వద్ద నుంచి రూ.17,950, గాజులపల్లె గ్రామంలో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.5,660 స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. వీరందరిపై కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-04-24T04:53:06+05:30 IST