ప్రణాళికాబద్ధంగా చదివితే అద్భుత ఫలితాలు

ABN , First Publish Date - 2021-10-30T05:07:36+05:30 IST

ప్రణాళికాబద్దంగా చదివితే అద్భుత ఫలితాలను సొంతం చేసుకోవచ్చని, తద్వారా ఉన్నత శిఖరాలను చేరుకునే మార్గం ఏర్పడుతుందని సమగ్రశిక్ష పథక జిల్లా అధికారి డాక్టర్‌ అంబవరం ప్రభాకర్‌ అన్నారు.

ప్రణాళికాబద్ధంగా చదివితే అద్భుత ఫలితాలు
విద్యార్థునులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తున్న పీఓ

ఎస్‌ఎ్‌సఏ పీఓ డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

వల్లూరు, అక్టోబరు 29: ప్రణాళికాబద్దంగా చదివితే అద్భుత ఫలితాలను సొంతం చేసుకోవచ్చని, తద్వారా ఉన్నత శిఖరాలను చేరుకునే మార్గం ఏర్పడుతుందని సమగ్రశిక్ష పథక జిల్లా అధికారి డాక్టర్‌ అంబవరం ప్రభాకర్‌ అన్నారు. శుక్రవారం వల్లూరు లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తని ఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ పాఠాలు శ్రద్ధగా వినాలన్నారు. ప్రతి తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. టీచర్ల సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థులు సమస్యలను ఎలా అదిగమించాలన్న అంశంపై సలహాలను అందజేశారు. పదో తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రణాళికబద్ద బోధన చేయాలని సూచించారు. ప్ర త్యేక తరగతులు నిర్వహించి వారితో మమేకమై వారి ఆలోచనలకు అనుగుణంగా ముందుకు కొనసాగాలని పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-30T05:07:36+05:30 IST