అధిక మొత్తం వసూలు చేస్తే చర్యలు
ABN , First Publish Date - 2021-08-22T05:02:33+05:30 IST
సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాల్లో రిజిస్ట్రేషన్కోసం రైతుల వద్ద అధిక మొ త్తాలు వసూలు చేస్తే చర్యలు తప్పవని రాష్ట్ర వ్యవసాయ సలహాదారుల సంఘం ఛైర్మన్ అంబటి కృష్ణారెడ్డి హెచ్చరించారు.
![అధిక మొత్తం వసూలు చేస్తే చర్యలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
దువ్వూరు, ఆగస్టు 21: సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాల్లో రిజిస్ట్రేషన్కోసం రైతుల వద్ద అధిక మొ త్తాలు వసూలు చేస్తే చర్యలు తప్పవని రాష్ట్ర వ్యవసాయ సలహాదారుల సంఘం ఛైర్మన్ అంబటి కృష్ణారెడ్డి హెచ్చరించారు. శనివారం దువ్వూరు సబ్రిజిస్ట్రార్కార్యాలయాన్ని తనిఖీ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులతో మా ట్లాడారు. ఇద్దరు రైతుల వద్ద ప్రభుత్వ చలానా కన్నా ఎక్కువ తీసుకున్నట్లు రైతులు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీ సుకెళతామన్నారు. రైతులకు మెరుగైన సేవలు అందించాలని, జిల్లాలో నకిలీ చలానాల బాగో తం విషయం తెలియడంతో పరిశీలించామన్నా రు. కార్యక్రమంలో ఎస్ఐ రాజు పాల్గొన్నారు.