600 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2021-05-18T05:17:19+05:30 IST
పేదలకు అందాల్సిన ప్రభుత్వ చౌక బియ్యాన్ని కొందరు అక్రమంగా కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరి అరెస్టు...25 మందిపై కేసు నమోదు
బద్వేలు, మే 17: పేదలకు అందాల్సిన ప్రభుత్వ చౌక బియ్యాన్ని కొందరు అక్రమంగా కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. సోమవారం స్థానిక పోలీసు స్టేషన్లో బద్వేలు అర్బన్ సీఐ రమే ష్బాబు వివరాలు వెల్ల డించారు. బద్వేలు పట్టణంలోని రూపురాంపేటలోని యాదళ్ల కృష్ణమూర్తి భవనంలో అక్రమంగా ప్రభుత్వ రేషన్ బియ్యం ఉందన్న సమాచారం రావడంతో రెవెన్యూ అధికారులతో కలిసి తనిఖీ చేశామన్నారు. 600 క్వింటాళ్లు రేషన్ బియ్యం లారీల్లో తరలించేందుకు సిద్ధంగా ఉండడంతో స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. లారీని సీజ్ చేసి ఇద్దరి వ్యక్తులను అరెస్టు చేసి, అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న బాధ్యులైన 25 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యం విలువ సుమారు రూ.9 లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు.