11 కరోనా కేసులు నమోదు
ABN , First Publish Date - 2021-03-08T04:45:54+05:30 IST
జిల్లాలో 24 గంటల వ్యవధిలో మరో 11 మందిలో కరోనా పాజిటివ్ వైరస్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కడప, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 24 గంటల వ్యవధిలో మరో 11 మందిలో కరోనా పాజిటివ్ వైరస్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 55593కి చేరుకుంది. కరోనా నుంచి కోలుకున్న ఐదు మందిని డిశ్చార్జి చేయగా మొత్తం 54920 మంది కోలుకున్నారు. 533 మంది మృతి చెందారు. హోం ఐసోలేషన్లో 64 మంది చికిత్స పొందుతున్నారు.