మట్కా స్థావరంపై పోలీసుల దాడి
ABN , First Publish Date - 2021-04-17T05:39:27+05:30 IST
పట్టణంలోని నవాజ్కుంట రైస్మిల్లు వెనుక ఉన్న జామాయిల్ తోటలో ఆన్లైన్ గేమ్ మట్కా (బ్రాకెట్) ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు.
ఐదుగురి అరెస్టు, రూ.40 వేలు స్వాధీం
వినుకొండ, ఏప్రిల్ 16: పట్టణంలోని నవాజ్కుంట రైస్మిల్లు వెనుక ఉన్న జామాయిల్ తోటలో ఆన్లైన్ గేమ్ మట్కా (బ్రాకెట్) ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. పట్టణానికి చెందిన వై.బాబూరావు, ఎ.కోటేశ్వరరావు, మౌలాలి, షేక్ నాగూర్, సందానిలను అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.40,260, ఐదు ఫోన్లు, ఆటకు సంబంధించిన చీటీలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు.