బంగారం షాపులో చోరీ
ABN , First Publish Date - 2021-10-29T05:16:20+05:30 IST
పట్టణంలోని రంగనాయకస్వామి దేవస్థానం సమీపంలోని అనూష్క బంగారం షాపులో బుధవారం రాత్రి చోరీ జరిగింది.

రూ.25 లక్షలు ఆభరణాల అపహరణ
వినుకొండ టౌన్, అక్టోబరు 28: పట్టణంలోని రంగనాయకస్వామి దేవస్థానం సమీపంలోని అనూష్క బంగారం షాపులో బుధవారం రాత్రి చోరీ జరిగింది. దుకాణంపై భాగంలోని రేకులను లోనికి వచ్చిన వారు 30 కేజీల వెండి, 200 గ్రాముల బంగారం, 2 లక్షల నగదు దొంగలు దోచుకెళ్లినట్లు షాపు యజమాని టీవీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్, పోలీసులు సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది. డీఎస్పీ వెంట పట్టణ ఇన్చార్జి సీఐ అశోక్కుమార్, ఎస్ఐ రాజ్యలక్ష్మి, ఏఎస్ఐ సాంబయ్య, సిబ్బంది ఉన్నారు.