ఫ్యాప్టో చైర్మనగా తిరుమలేష్‌

ABN , First Publish Date - 2021-10-22T05:13:03+05:30 IST

ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) నూతన కార్యవర్గ ఎన్నిక గురువారం స్థానిక ఏపీటీఎఫ్‌ కార్యాలయంలో నిర్వహించినట్లు చైర్మన బసవలింగారావు ఒక ప్రకటనలో తెలిపారు.

ఫ్యాప్టో చైర్మనగా తిరుమలేష్‌
తిరుమలేష్‌, ఫైజుల్లా

గుంటూరు(విద్య), అక్టోబరు 21: ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) నూతన కార్యవర్గ ఎన్నిక గురువారం స్థానిక ఏపీటీఎఫ్‌ కార్యాలయంలో నిర్వహించినట్లు చైర్మన బసవలింగారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్యాప్టో చైర్మనగా తిరుమలేష్‌, కార్యదర్శిగా షేక్‌ ఫైజుల్లా, కో చైర్మన్లుగా ప్రేమ్‌కుమార్‌, ఎస్‌ రామచంద్రయ్య, చాంద్‌బాష, వెంళాగిణిరాజు ఎంపికయ్యారన్నారు. ట్రెజర్‌గా మేకల సుబ్బారావు, డిప్యూటీ జనరల్స్‌గా యూఏ రాజు, మదనమోహన, కార్యదర్శిగా వీరాంజనేయులు, కార్యవర్గ సభ్యులుగా బసవలింగరావు, నరసింహారావు, కళాధర్‌, పెదబాబు, ప్రసాద్‌, శ్రీనివాసరెడ్డి, ఎం రవికుమార్‌, చంద్రయ్య, అశోక్‌ తదితరులు ఎన్నికయ్యారన్నారు.   ఎన్నికల అధికారిగా శౌరిరాయలు వ్యహరించారు.


Updated Date - 2021-10-22T05:13:03+05:30 IST