గిరిజనులపై వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు

ABN , First Publish Date - 2021-08-25T06:01:31+05:30 IST

గిరిజనులపై వైసీపీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఎస్టీ కార్పొరేషన మాజీ చైర్మన, టీడీపీ నేత ఎం.ధారునాయక్‌ విమర్శించారు.

గిరిజనులపై వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు
సమావేశంలో ప్రసంగిస్తున్న టీడీపీ నేతలు ధారునాయక్‌ తదితరులు

ఎం.ధారునాయక్‌

గుంటూరు, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): గిరిజనులపై వైసీపీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఎస్టీ కార్పొరేషన మాజీ చైర్మన, టీడీపీ నేత ఎం.ధారునాయక్‌ విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.  తూర్పు గోదావరి జిల్లా రంపచోడవంలో ఐటీడీపీఏ పీవో గిరిజన సంఘాల నాయకులను అభివృద్ధిపై చర్చకు పిలిపించి కింద కూర్చోమని చెప్పడం  దుర్మార్గం అన్నారు.  గిరిజన గ్రామాలు, తండాలలో విషజ్వరాల సమస్యను పట్టించుకును నాథుడే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బెస్ట్‌ అవైలబుల్‌ స్కీంను వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడంతో 17వేల మంది గిరిజన విద్యార్థులు విద్యకు దూరమయ్యారన్నారు. సమావేశంలో రాష్ట్ర ఎస్టీ సెల్‌ నేత కె.పున్నయ్య నాయక్‌, నేతలు మద్దిరాల గంగాధర్‌, మేడా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 


Updated Date - 2021-08-25T06:01:31+05:30 IST