మెరుగైన విద్యాబోధనకు ప్రభుత్వం కృషి
ABN , First Publish Date - 2021-09-04T05:12:54+05:30 IST
విద్యార్థులకు మెరుగైన బోధనతోపాటు, మంచి సౌకర్యాలు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని సమగ్రశిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కె వెట్రిసెల్వి అన్నారు.

ఎస్ఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ వెంట్రిసెల్వి
గుంటూరు(విద్య), సెప్టెంబరు 3: విద్యార్థులకు మెరుగైన బోధనతోపాటు, మంచి సౌకర్యాలు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని సమగ్రశిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కె వెట్రిసెల్వి అన్నారు. శుక్రవారం మంగళగిరి మండలంలోని భవిత కేంద్రాల్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిత కేంద్రాలను సమర్ధంగా ఉపయోగించుకోవాలని సూచించారు. నంబూరులోని జిల్లా పరిషత పాఠశాలలో జగనన్న విద్యాకానుక పంపిణీ సక్రమంగా జరగడం లేదని ఫిర్యాదులు రావడంతో సీఆర్పీ, హెచఎంలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదకాకాని మండలం లూథర్గిరి, వెనిగండ్లలోని జడ్పీ పాఠశాలలో నాడు నేడు పనుల్ని పరిశీలించారు. పర్యటనలో ఆర్ఎంఎస్ఎ డైరెక్టర్ పి.పార్వతి, డీఈవో ఆర్ఎస్ గంగాభవాని, ఎస్ఎస్ అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎం.వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు.