సాగర్ నీటి సమాచారం
ABN , First Publish Date - 2021-08-28T04:09:47+05:30 IST
నాగార్జునసాగర్ నీటిమట్టం శుక్రవారం నాటికి 586.90 అడుగులు ఉంది. ఇది 304.96 టీఎంసీలకు సమానం.
![సాగర్ నీటి సమాచారం](https://media.andhrajyothy.com/appimg/galleries/1921082710384939/08272021223948n3.gif)
విజయపురిసౌత, ఆగస్టు 27: నాగార్జునసాగర్ నీటిమట్టం శుక్రవారం నాటికి 586.90 అడుగులు ఉంది. ఇది 304.96 టీఎంసీలకు సమానం. కుడికాలువ ద్వారా 7,678 క్యూసెక్కులు, ఎడమకాలువ ద్వారా 5,018, ప్రధాన జలవిద్యుత కేంద్రం ద్వారా 33,373, ఎస్ఎల్బీసీ ద్వారా 1,800, ఎల్ఎల్సీ ద్వారా 400 క్యూసెక్కులు, మొత్తం ఔట్ఫ్లో వాటర్గా 47,869 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్కు ఇనఫ్లో వాటర్గా 47,869 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 876.10 అడుగులుంది. ఇది 169.06 టీఎంసీలకు సమానం. రోజా నుంచి 4311 క్యూసెక్కులు, జూరాల నుంచి 7981 క్యూసెక్కులు, మొత్తంగా 12,292 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి ఇనఫ్లో వాటర్గా వచ్చి చేరుతోంది.
బ్యారేజి దిగువకు 26,000 క్యూసెక్కులు
తాడేపల్లి టౌన్: ప్రకాశం బ్యారేజి వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టు ఎగువున్న వాగుల నుంచి శుక్రవారం సాయంత్రానికి 38,000 క్యూసెక్కుల వరద నీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరుతున్నట్టు నీటి పారుదల శాఖ జేఈ దినేష్ తెలిపారు. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 12,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. బ్యారేజి రిజర్వాయర్ వద్ద 12 అడుగుల నీటిమట్టం నమోదవుతుండగా 35 గేట్లను ఒక అడుగువంతున ఎత్తి 26,000 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు.