నాలుగు క్రస్ట్గేట్ల ద్వారా నీటి విడుదల
ABN , First Publish Date - 2021-10-20T05:38:06+05:30 IST
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నాలుగు క్రస్ట్గేట్ల ద్వారా నీటి విడుదలవుతోంది. సాగర్ నీటిమట్టం మంగళవారం నాటికి 589.80 అడుగులు ఉంది.
విజయపురిసౌత, అక్టోబరు 19: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నాలుగు క్రస్ట్గేట్ల ద్వారా నీటి విడుదలవుతోంది. సాగర్ నీటిమట్టం మంగళవారం నాటికి 589.80 అడుగులు ఉంది. ఇది 311.44 టీఎంసీలకు సమానం. కుడి కాలువ ద్వారా 9,633 క్యూసెక్కులు, ఎడమకాలువ ద్వారా 7,436, ప్రధాన జలవిద్యుత కేంద్రం ద్వారా 33,982, 4 క్రస్ట్గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 32,316, ఎస్ఎల్బీసీ ద్వారా 1,800, మొత్తం ఔట్ఫ్లో వాటర్గా 85,167 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. ఇనఫ్లో వాటర్గా 85,167 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 883.90 అడుగులుంది. ఇది 209.59 టీఎంసీలకు సమానం.
బ్యారేజి దిగువకు 41,000 క్యూసెక్కులు
తాడేపల్లి టౌన్: పులిచింతల ప్రాజెక్టు ఎగువున్న వాగుల నుంచి ప్రకాశం బ్యారేజీకి మంగళవారం సాయంత్రానికి 56,600 క్యూసెక్కుల వరద నీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరుతోంది. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 15,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే బ్యారేజి రిజర్వాయర్ వద్ద 12 అడుగుల నీటిమట్టం నమోదవుతుండగా 55 గేట్లను అడుగు వంతున ఎత్తి 41,000 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.