హాజరుపై అవగాహన కల్పించాలి
ABN , First Publish Date - 2021-11-26T06:15:29+05:30 IST
అమ్మఒడి పథకంలో ఈ పర్యాయం 75 శాతం హాజరు తప్పనిసరి చేసినందున విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని విద్యాశాఖ ఆర్జేడీ సుబ్బారావు తెలిపారు

తెనాలి అర్బన్, నవంబరు 25: అమ్మఒడి పథకంలో ఈ పర్యాయం 75 శాతం హాజరు తప్పనిసరి చేసినందున విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని విద్యాశాఖ ఆర్జేడీ సుబ్బారావు తెలిపారు. తెనాలిలో గురువారం డివిజన్లోని ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, హాజరు, మరుగుదొడ్ల వివరాలను యాప్ల ద్వారా నమోదు చేయాలన్నారు. రెండో దశలో నాడు-నేడు అమలవుతున్న పాఠశాలల్లో ప్రతిపాదనలు త్వరితగతిన పూర్తి చేసి అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో డీఈవో గంగాభవాని, డిప్యూటీ డీఈవో నారాయణ, ఎంఈవో లక్ష్మీనారాయణ, మధ్యాహ్న భోజన ఏడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.