31న పోలీసులకు శాఖాపరమైన పరీక్షలు

ABN , First Publish Date - 2021-07-24T05:41:11+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయ పోలీసులకు ఈనెల 31న శాఖాపరమైన పరీక్షలు నిర్వహిస్తున్నట్టు రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ స్పష్టం చేశారు.

31న పోలీసులకు శాఖాపరమైన పరీక్షలు
పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ

పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన రూరల్‌ ఎస్పీ 

గుంటూరు, జూలై 23: గ్రామ, వార్డు సచివాలయ పోలీసులకు ఈనెల 31న శాఖాపరమైన పరీక్షలు నిర్వహిస్తున్నట్టు రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం టీజేపీఎస్‌ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలిచ్చారు. మహిళా పోలీసులు పరీక్షా కేంద్రంలోకి నిర్ధేశించిన సమయానికి ముందే చేరుకోవాలన్నారు. ఈ పరీక్షలకు అర్బన్‌ దిశ పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీ రవికుమార్‌ పర్యవేక్షిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్‌ అడ్మిన్‌ అదనపు ఎస్పీ దిశాంత్‌రెడ్డి, దిశ డీఎస్పీ రవికుమార్‌, జిల్లా శిక్షణ  కేంద్రం సీఐలు సత్యనారాయణ, పూర్ణచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-24T05:41:11+05:30 IST